Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రైతు మృతి-వడ్ల కుప్పపైనే నేలకూలిపోయాడు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:48 IST)
తెలంగాణలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వడ్ల కుప్పపై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవలే జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్​కు చెందిన రైతు బీరయ్య వడ్ల కుప్పపైనే చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా రోజుల తరబడి ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలు గుండెపగిలి వడ్ల కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య(55)  పది రోజుల క్రితం తన వడ్లను స్థానిక కొనుగోలు సెంటర్​కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే కావలి ఉంటున్నారు. 
 
గురువారం సాయంత్రం రాజయ్య కుప్ప వద్ద కావలి ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పి వస్తున్నదని, చెమటలు పడుతున్నయని మిగతా రైతులకు చెప్పాడు. వాళ్లు వెంటనే కామారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రాజయ్య అప్పటికే గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments