Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను ఎందుకు బహిష్కారంటే...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:00 IST)
KK
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. తెరాస కొత్త నాటకానికి దారితీసిందని, మంగళవారం పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించబోతున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. ఆయన మాటలను నిజం చేస్తూ తెరాస సభ్యులు ఇపుడు పార్లమెంట్ సమావేశాలను రద్దు చేశారు. 
 
దీనిపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని గత ఏడు రోజులుగా డిమాండ్ చేస్తూ, నిరసనలు తెలుపుతున్నామని, కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతుందన్నారు. 
 
బాయిల్డ్ రైస్ కొంటారో లేదే కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సభలో నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే తమ పార్టీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments