Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుడికి ఆపన్న హస్తం అందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:41 IST)
దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి మాజీ ఎంపీ కవిత మూడు చక్రాల స్కూటీని అందించారు.

వినయ్ దీనావస్తపై ఇటీవల పత్రికలో వచ్చిన కథనానికి చలించిన ఆమె అతడితో నేరుగా మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
కోరుట్లో బీమునిదిబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్ సువర్ణ దంపతుల కుమారుడు వినయ్ చిన్ననాటి నుంచి చదువుల్లో రాణించి మంచి ర్యాంకులు సాధించాడు. హైదరాబాద్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తిచేశాడు. ఇంటికి వచ్చిన వినయ్ తన అక్కను వారింట్లో దింపడానికి వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు.
 
వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించగా రూ.18 లక్షలు వరకు ఖర్చు అయ్యాయి. అయినా పరిస్థితి మెరుగుపడక పోవడంతో 6 ఏండ్లుగా వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వినయ్ పరిస్థితిని గమనించి సాయం అందించిన మాజీ ఎంపీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments