Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్‌కు త్వరలోనే వీఆర్ఎస్ : జేపీ నడ్డా జోస్యం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (20:12 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ (వీఆర్ఎస్) వస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ వేదికగా గురువారం భారీ బహిరంగ సభను నిర్వహించారు.  
 
ఇందులో జేపీ నడ్డా ప్రసంగిస్తూ, తెలంగాణాకు సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చివేశారని ఆరోపించారు. అందినంత దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజలు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారం, కేసీఆర్‌కు విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. పైగా, సీఎం కేసీఆర్‌ను గద్దెదించగల శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 
 
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ కానుందని ఎద్దేవా చేశారు. ఒక దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని నడ్డా ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు కుటుంబ పాలన తప్ప ప్రజా సంక్షేమం గురించిన ఆలోచన ఉండదని అన్నారు. బీజేపీ మాత్రమే కీసీఆర్‌ను గద్దె దించగలదని నడ్డా జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments