Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు ట్యాబ్లెట్లను భోజనం కలిపి భర్తకు వడ్డించిన భార్య...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (21:30 IST)
తాను సాగిస్తున్న రంకుబాగోతానికి కట్టుకున్న భర్త అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో ఓ భార్య దారుణానికి పాల్పడింది. మత్తు మాత్రలు కలిపిన భోజనం భర్తకు వడ్డించింది. విషయం తెలియని భర్త.. ఆ భోజనం ఆరగించగానే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హత్య చేసింది. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గద్వాల జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజు అతని భార్య మాధవి గద్వాల మండలం తూర్పుపల్లి గ్రామంలో బత్తాయి తోటలో పని చేస్తున్నారు.
 
అయితే, మాధవికి మక్తల్ మండలం కలవల దొడ్డి గ్రామానికి చెందిన మునేష్‌ అనే వ్యక్తితో పెండ్లికి ముందు నుంచే పరిచయం ఉంది. దీంతో అతనితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యతో తరచూ గొడవలు పడుతూ వచ్చేది. దీంతో భర్తను ఎలాగైనా చంపాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఈ విషయం తన ప్రియుడు మునేష్‌కు తెలియజేసి ఈ నెల 2న హత్యకు ప్లాన్ వేసింది. ఆ రోజు రాత్రి భార్య మాధవి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి భోజనం వడ్డించింది. రాజు మత్తులోకి జారుకోగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రియుడితో పాటు అతని మిత్రులు కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు.
 
హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి రాజు శవాన్ని పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర పడేసి వెళ్లారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మాధవిని అదుపులోకి తీసుకొని విచారించగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments