Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం కేసులో మహిళా కార్పొరేటర్ భర్త అరెస్టు

అత్యాచారం కేసులో మహిళా కార్పొరేటర్ భర్త అరెస్టు
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:10 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఓ అత్యాచార కేసులో మహిళా కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇది స్థానికంకా సంచలనమైంది. ఈ విషయాన్ని వరంగల్‌ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్‌ భర్త శిరీష్‌ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సెప్టెంబర్‌ 23వ తేదీన కార్పొరేటర్‌ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేసినట్లు మీల్స్‌ కాలనీ పోలీసులు తెలిపారు.
 
అప్పటి నుంచి శిరీష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహరైన్ నుంచి శ్రీకాకుళం తిరిగి వ‌చ్చిన‌ వ‌ల‌స కార్మికులు