Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూఛ్... అలా అనలేదు.. సీఎం కేసీఆర్, ఉద్యోగుల కృషి వల్లే కరోనా మాయం.. శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (15:47 IST)
Srinivasa Rao
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పల్టీకొట్టారు. బుధవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని.. కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్‌‍ను ఏసు ప్రభువు రక్షించారనీ, ఆయన దయ, కృప వల్లే ఈ వైరస్ నుంచి విముక్తి పొందినట్టు వ్యాఖ్యానించారు.

పైగా, మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు. మనం చేసిన సేవలు వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆయన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆరోపించారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశఆరు. దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవు, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments