Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సార్‌ని నిలదీయాటానికే తెలంగాణలో కొత్త పార్టీ.. వైఎస్ షర్మిల క్లారిటీ

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (12:00 IST)
తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టబోతున్నారనే ఖమ్మంలో సంకల్ప సభలో వైఎస్‌ షర్మిల క్లారిటీ ఇచ్చారు. 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న తన తండ్రి చేసిన పాదయాత్రను గుర్తు చేసుకుంటూ.. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో తెలంగాణ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానో చెప్పారామె. 
 
తన తండ్రి చేసిన అభివృద్ధి గురించి చెబుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ.. అధికార పార్టీ పని తీరుపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్య ఏమైందని.. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్న ఆమె.. సీఎం సార్‌ని నిలదీయాటానికే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నానని కుండ బద్దలు కొట్టారు. 
 
కొత్త పార్టీ పెట్టేందుకు ఇంకా టైమ్ ఉందంటూ.. ఈ గ్యాప్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న లక్షా తొంభై ఆరువేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై గళమెత్తేందుకు రెడీ అవుతున్నారు షర్మిల. 
 
నిరుద్యోగం కారణంగా.. ప్రతిరోజూ ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారామె. ప్రభుత్వం దిగి వచ్చేలా.. ఈనెల 15 తేదీ నుంచి హైదరాబాద్‌లో దీక్షలు చేస్తానని చెప్పారు షర్మిల. పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనూ టార్గెట్‌ చేశారు షర్మిల. 
 
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లయ్‌ చేసే పార్టీగా మారిందని.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అమ్ముడు పోయిందని షర్మిల ఆరోపించారు అటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు షర్మిల. తెలంగాణలో బలపడేందుకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments