Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:59 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో 3 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన ఈడీ, ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చి, ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగడం కలకలం రేపుతుంది. 
 
కాగా, బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగొచ్చని ముందుగానే పసిగట్టారు. ఆ విధంగానే అధికారులు గురువారం వేకువజాము నుంచి సోదాలకు రావడం గమనార్హం. కాగా, తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటూ అనేక ముందస్తు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐడీ అధికారులు సోదాలకు దిగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments