పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:59 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో 3 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన ఈడీ, ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చి, ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగడం కలకలం రేపుతుంది. 
 
కాగా, బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగొచ్చని ముందుగానే పసిగట్టారు. ఆ విధంగానే అధికారులు గురువారం వేకువజాము నుంచి సోదాలకు రావడం గమనార్హం. కాగా, తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటూ అనేక ముందస్తు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐడీ అధికారులు సోదాలకు దిగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments