Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:59 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో 3 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన ఈడీ, ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చి, ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగడం కలకలం రేపుతుంది. 
 
కాగా, బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగొచ్చని ముందుగానే పసిగట్టారు. ఆ విధంగానే అధికారులు గురువారం వేకువజాము నుంచి సోదాలకు రావడం గమనార్హం. కాగా, తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటూ అనేక ముందస్తు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐడీ అధికారులు సోదాలకు దిగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments