Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి జగదీష్ రెడ్డి పీఏ నివాసంలో ఐటీ సోదాలు.. రూ.4 లక్షలు స్వాధీనం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:41 IST)
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నల్గొండ తిరుమలనగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి నివాసంలో 30 మంది సభ్యులతో కూడిన బృందం సోదాలు నిర్వహించి రూ.4 లక్షలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
ఆయన కారును కూడా అధికారులు సీజ్ చేశారు. అలాగే, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రి జగదీశ్ రెడ్డి కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
 
కాగా, ఈ నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఐటీ అధికారులు మంత్రి జగదీష్, ఆయన పీఏ నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments