తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

Webdunia
మంగళవారం, 30 మే 2023 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఈ పరువు నష్టం దావా నోటీసులను పంపించింది. 
 
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్‌ వసూలు కాంట్రాక్ట్‌ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఓఆర్‌ఆర్‌ టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు, అవినీతి జరిగిదంటూ రఘునందన్ రావు ఆరోపణలు చేయడంతో ఆగ్రహించిన ఐఆర్‌బీ సంస్థ ఈ నోటీసులను పంపించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments