Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో అసంతృప్తి... అల్లుడితో మేనత్త అక్రమ సంబంధం... ఆ తరువాత?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (14:19 IST)
వావి వరసలు మరిచాడు. మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే అతని ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాతబస్తీలోని సబ్జీమండీకి చెందిన జావెద్ కారు పెయింటర్‌గా పనిచేస్తుండేవారు. మదీనా నగర్‌లో నివాసముండే తన మేనమామకు ఇద్దరు భార్యలు.
 
భర్త సరిగ్గా పట్టించుకోవడంతో మేనల్లుడు జావెద్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది మేనత్త. నాలుగేళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ ఉండేది. జావెద్ మేనత్తకు ఖతర్‌లోని ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్ళింది. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బును జావెద్‌కు పంపించేది మేనత్త. 
 
విషయం కాస్తా కుమారులకు తెలిసింది. తమ తల్లితో వివాహేతర సంబంధం వదులుకోవాలని జావెద్‌ను పలుమార్లు హెచ్చరించారు బావమరుదులు సుహేష్, సులేమాన్‌లు. వాళ్లు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోలేదు జావెద్. ఎలాగైనా జావెద్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు ఆమె కుమారులు. తమ మరో స్నేహితుడి సహాయంతో ముగ్గురు మదీనా నగర్ లోని తమ ఇంటిలో కూర్చుని జావెద్‌కు ఫోన్ చేసి పిలిపించారు. 
 
కావాలనే జావెద్‌తో గొడవ పెట్టుకున్నారు. వారితో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వస్తున్న జావెద్ పైన కత్తులతో దాడికి దిగారు. వేట కత్తులతో అతి దారుణంగా నరికి చంపేసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments