Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి బయటికి వచ్చి కుటుంబంతో సహా చప్పట్లు కొడతా: కేసీఆర్

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (16:29 IST)
‘‘ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై సోషల్ మీడియాలో కొందరు హేళన చేస్తున్నారు. సాయంత్రం బయటికి వచ్చి చప్పట్లు కొడితే తప్పేంది. దేశ ఐక్యతను చూపించుకోవడానికి ఇలాంటిది చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటికి వచ్చి నా కుటుంబంతో సహా చప్పట్లు కొడతాను" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. ప్రధానిపై ట్రోల్స్ చేయడం చాలా దారుణమని, అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీకి చెబుతున్నానని కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడికి ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తామని కేసీఆర్ అన్నారు.

ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి ప్రెస్‌మీట్‌లోనే ఆదేశాలు జారీ చేశారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వ్యక్తిగత బాధ్యతతో కరోనా కట్టడీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, విదేశాల నుంచి వచ్చినవారికి చేతులెత్తి దండం పెడుతున్నానని అన్నారు.

‘‘మీరు మా రాష్ట్రం బిడ్డలే. బయట తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. క్వారంటైన్‌ నుంచి ఎందుకు పారిపోవాలి? ప్రజలు ప్రభుత్వానికి సహకరించండి. ప్రభుత్వ రవాణా సంస్థల్ని నిలిపివేస్తున్నాం. సోమవారం ఉదయం వరకు ప్రజలు ఎవరూ బయటికి రావద్దు’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments