వాళ్లకేమైనా జరిగితే నేను కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వస్తా: బండి సంజయ్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (16:12 IST)
బీజేపీ ఓబీసీ మోర్చా పదాధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బడుగులు, బలహీన వర్గాల కోసం మేము పోరాడుతున్నామన్నారు. గిరిజనుల భూములు రక్షించేందుకు మావాళ్ళు వెళ్తే కబ్జాదారులకు కేసీఆర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
 
సూర్యాపేట్ జిల్లా అధ్యక్షుడుతో సహా చాలామందిని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఎవరిని ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు. మా వాళ్లకు ఏ హాని జరిగిన కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వస్తా. భయపడే ప్రసక్తే లేదు. గిరిజన భూముల కోసం మేము వెళ్తే కబ్జాదారుల కోసం కేసీఆర్ పోలీసులతో లాఠీచార్జి చేయించిండు.
 
మావాళ్లను బేషరతుగా వదిలేయాలి. మేము ఐపీఎస్ ఆఫీసర్లను జరుగుతున్న అవమానంపై ప్రశ్నిస్తున్నాం. రిటైర్ అయిన ఆఫీసర్లకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి అర్హులైన ఆఫీసర్లకు ద్రోహం చేస్తున్నారు. పోలీసులకు, మాకు గొడవ కాదు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకుల్ని వెంటనే వదిలేయాలి.
 
నాగార్జున సాగర్‌లో గిరిజనులు ఖచ్చితంగా దీనిపై పగ తీర్చుకుంటారు. వచ్చే రెండేళ్లు ఓబీసీ మోర్చా పదాధికారులంతా కష్టపడాలి.పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments