Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన హ్యుందామ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:12 IST)
హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సీఎస్‌ఆర్‌ విభాగం హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) నేడు నిమిషానికి 50 లీటర్ల (ఎల్‌పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించింది.
 
ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ శ్రీ ఉపేంద్ర జాదవ్‌ తో పాటుగా హెచ్‌ఎంఐఎల్‌ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా ఆసుపత్రిలోని దాదాపు 50 ఐసీయు పడకల ఆక్సిజన్‌ అవసరాలు తీరనున్నాయి. అంతేకాదు, దాదాపు ఒక లక్ష మంది రోగులకు సైతం ఇది  సహాయపడనుంది. కోవిడ్‌ –19 రోగులతో పాటుగా ఇతర సంబంధిత వైద్య సమస్యలు కలిగిన  రోగులకు ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడం ద్వారా తగిన చికిత్స నందించేందుకు ఈ మెడికల్‌ ఆక్సిజన్‌ తోడ్పడుతుంది.
 
ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం సందర్భంగా శ్రీ ఎస్‌ఎస్‌ కిమ్‌, ఎండీ అండ్‌ సీఈవొ- హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మహమ్మారి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొవాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. మా అంతర్జాతీయ లక్ష్యం ‘మానవత్వం కోసం అభివృద్ధి’ ద్వారా, ఆరోగ్య మౌలికవసతులను బలోపేతం చేయడం కోసం వైద్య సిబ్బంది మరియు కమ్యూనిటీకి మద్దతునందిస్తున్నాం.


తీవ్ర అనారోగ్యం బారిన రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్‌ను నిరంతరం సరఫరా చేయడం అవసరం. అందువల్ల మేము ఈ సదుపాయాన్ని ఆసుపత్రిలో ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్‌ డిమాండ్‌ను సైతం తీర్చనున్నాం’’అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments