Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు బండి నడుపుతుంటే వెనుక కూర్చొన్న యువకుడు గొంతుకోశాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (11:34 IST)
హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో ఓ యువకుడి మరో యువకుడి గొంతు కోశాడు. వెనుక కూర్చొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.
 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాఫానగర్‌లో నివసించే మహ్మద్‌ అబ్దుల్‌ షారుఖ్‌(24)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి యాక్టివా (టీఎస్‌ 12 ఈఈ 3501)పై బయటకు వెళ్లాడు. 
 
అయితే… జహనుమా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా బండి నడుపుతున్న పారుఖ్‌ను వెనకకూర్చున్న వ్యక్తి గొంతుకోశాడు.. కిందపడిన ఫరూఖ్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి సత్తార్‌ హోటల్‌ ముందు పడి మృతి చెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఎస్సై వెంకటేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments