Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
, సోమవారం, 7 జూన్ 2021 (09:35 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు జూన్ నుంచి పెరగడం ప్రారంభించాయి. అయితే సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది. నిజానికి బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.
 
ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్‌ల బంగారం ధర రూ.47,110 (ఆదివారం రూ.47,100), 24 క్యారెట్ల గోల్డ్ రూ.51,260 (ఆదివారం రూ.51,250)గా ఉంది. 
 
అలాగే, దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌ైలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.48,310 (ఆదివారం రూ.48,300), 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,310 (ఆదివారం రూ.49,300గా వుంది. 
 
ఇకపోతే, త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.46,160 (ఆదివారం రూ.46,150)గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,360 (ఆదివారం రూ.50,350)గా వుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.45,910 (ఆదివారం రూ.45,900), 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,080 (ఆదివారం రూ.50,070)గాను, విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ రూ.45,910 (ఆదివారం రూ.45,900, 24 క్యారెట్ల గోల్డ్ రూ.50,080 (ఆదివారం రూ.50,070గా వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. 14మంది మృతి