Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అశ్లీల చాటింగ్ చేయాలి... ఫోన్ చేసినపుడు మాట్లాడాలి'.. టీఆర్ఎస్ కార్పొరేటర్ సన్ వేధింపులు

'నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ మాట్లాడాలి. ఫోన్ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా'నంటూ హైదరాబాద్ నగరంలో అధికార తెరాసకు చెందిన కార్ప

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:34 IST)
'నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ మాట్లాడాలి. ఫోన్ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా'నంటూ హైదరాబాద్ నగరంలో అధికార తెరాసకు చెందిన కార్పొరేటర్ తనయుడు చేసిన బెదిరింపులు, వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు ఒకరికి ఇద్దరికీ కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో యువతులకు వెళ్ళాయి. దీంతో ముగ్గురు బాధితురాళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీ టీమ్స్ తెరాస కార్పొరేటర్‌ తనయుడిని అరెస్టు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌. అభిషేక్‌ తాను చదివిన స్కూల్‌లో కొన్నేళ్ల క్రితం చదివిన విద్యార్థినుల వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా సేకరించాడు. తానూ అదే స్కూల్‌లో చదివిన యువతిగా పరిచయం చేసుకుంటూ ఖాతా తెరిచాడు. అప్పటికే స్కూల్‌ పూర్వ విద్యార్థుల వివరాలు అతడికి తెలిసి ఉండటంతో వారందరికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు. 
 
అనంతరం వారి ఫోన్‌ నెంబర్లు ఇతర వివరాలు సేకరించిన అభిషేక్‌ ఆ తర్వాత అసలు కథ ప్రారంభించాడు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ను వినియోగించాడు. గత పక్షం రోజులుగా ఒక్కో యువతికి కాల్‌ చేస్తూ చెప్పలేని విధంగా వేధించసాగాడు. ‘నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేవాడు. 
 
ఇలా గత 15 రోజులుగా పలువురు యువతులకు నరకం చూపించాడు. దీంతో పలువురు బాధితురాళ్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే దాని చిరునామా ఒకచోట, లోకేషన్స్‌ మరోచోట రావడంతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి యువతులను వేధిస్తున్నట్లు గుర్తించారు. చివరకు మల్కాజిగిరిలో మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నారు.
 
దీనిపై సైబరాబాద్‌ ఏసీపీ మాట్లాడుతూ... అభిషేక్‌ ఆగడాలపై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతడు సోషల్‌మీడియాలో యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌పై ఐపీసీ సెక్షన్ 67(ఏ), ఐటీ యాక్ట్‌ 354 (డీ) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments