Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఉద్యోగుల పేరుతో ఒంటరిగా యువతిపై అత్యాచారం...

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (13:03 IST)
ఇటీవలి కాలంలో తమ ఇళ్ళలో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు బ్యాంకు ఉద్యోగుల పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. 
 
మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని యువతి ఉంటున్న ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి ఇంటి బయట కాపలా ఉండగా.. మరో వ్యక్తి యువతితో ఫైనాన్స్‌ గురించి మాటలు కలిపి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు యువతి బిగ్గరగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. 
 
ఈ ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments