Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ భారీవర్షం, వరదలు: 24 మంది మృతి

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (13:48 IST)
హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా వర్షాలు భారీగా కురవడంతో నగరం పూర్తిగా జలమయంగా మారిపోయింది. నగరంలో ఇలాంటి భయానక పరిస్థితి సృష్టించిన వాయుగుండం హైదరాబాదును దాటింది. సుమారు 30 ఏళ్ల తర్వాత సరిగ్గా భాగ్యనగరం మీదుగా ప్రయాణించిన వాయుగుండం చివరికి కర్ణాటక చేరింది. దీంతో నగరవాసులు వాయుగుండం తాకిడి నుండి తప్పించుకున్నారు.
 
అయితే వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో భాగ్యనగరంలో ఇక వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం కర్ణాటక తాకినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పలుచోట్ల పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు.
 
కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం రాత్రి కూడా నగరంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నగరంలో మంగళవారం నుండి కురిసిన వర్షాలతో మహానగరం పూర్తిగా జలమయం అయింది. ఇప్పటికే నగరంలో కురిసిన వర్షాలకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ప్రవాహం ఉధృతం కావడంతో పలుచోట్ల జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments