Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి వేరొక అమ్మాయితో.. కేసీఆర్ డ్రైవర్‌పై దాడి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:54 IST)
తనను నిశ్చితార్థం చేసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ డ్రైవర్‌పై ఓ యువతి కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన శశికుమార్ .. కానిస్టేబుల్. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాన్వాయ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే అతనికి 2019 నవంబరు నెలలో హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. అనంతరం రూ.5 లక్షల కట్నం కోసం ఒప్పందం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని శశికుమార్‌.
 
దీంతో బాధితురాలు.. హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీసు ఠాణా, నాగర్‌ కర్నూల్‌ పోలీసు ఠాణాలలో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. 
 
తాజాగా శశికుమార్‌ పై బాధితురాలు ఫిర్యాదు మేరకు కుల్సుంపురా పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ పి.శంకర్‌ పర్యవేక్షణలో ఎస్సై శేఖర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments