Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కోసం యాచకుల మధ్య కీచులాట.. ఒకరు హత్య!

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:54 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ కోసం ఇద్దరు యాచకులు గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా మారి ఓ భిక్షగాడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు... సర్దార్‌(35), ఖాజా పాషా(40) అనే ఇద్దరు యాచకులు ఫుట్‌పాత్‌పై ఉంటూ ప్రతిరోజూ యాచకవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాచకురాలి (మహిళ) కుమారుడు ఏడాదిన్నర బాలుడు ఇటీవల కిడ్నాపయ్యాడు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి చిన్నారిని తల్లికి అప్పగించారు. 
 
ఆ సమయంలో ఇద్దరు యాచకులు ఆ మహిళ వెంట ఉన్నారు. యాచకులిద్దరూ ఆమెపై మనసుపడ్డారు. దీంతో ఆమె కోసం పాషా, సర్ధార్‌ ఆదివారం అర్థరాత్రి గొడవపడ్డారు. సంతోష్‌ అనే వ్యక్తితో కలిసి పాషా... సర్దార్‌ను పిడిగుద్దులు గుద్దడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. 
 
ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... సర్దార్‌ హత్యకు కారకుడైన పాషాతోపాటు సహకరించిన సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments