Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి తాళం వేసిన బ్యాంకు సిబ్బంది

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:14 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న యూనియన్ బ్యాంకు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా నడుచుకున్నారు. బ్యాంకుకు వచ్చిన 87 యేళ్ళ వృద్ధుడిని లాకరు గదిలో ఉంచి బ్యాంకుకు తాళం వేశారు. దీంతో ఆ వృద్ధుడు 18 గంటల పాటు బ్యాంకు లోపలిభాగంలోనే ఉండిపోయారు. మరుసటి రోజు బ్యాంకుకు వచ్చిన సిబ్బంది అతన్ని గమనించి  విస్తుపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, సోమవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు బ్యాంకుకు వెళ్లాడు. ఆయన బ్యాంకులోని లాకర్‌ గదిలో ఉన్న విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు.
 
దీంతో బ్యాంకు పని వేళులు ముగియడంతో దానికి తాళం వేసి వెళ్లిపోయారు. బ్యాంకు నుంచి బయటకు రాలేక కృష్ణారెడ్డి అందులోనే ఉండిపోయారు. ఆయన వద్ద సెల్ ఫోన్ కూడా లేదు. దీంతో చీకటిపడినప్పటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశఆరు. దీంతో పోలీసులు సీసీ టీవీ కెమెరాలు చూడగా కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్టు గుర్తించారు. 
 
మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు సిబ్బంది వచ్చిన తర్వాత లాకరు గది నుంచి బ్యాంకు వృద్ధుడిని పోలీసులు రక్షించారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న వృద్ధుడిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments