Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌పై కాల్పులు - హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో అలెర్ట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (09:11 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ఢిల్లీకి తిరిగి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. ముందుస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
 
పాతబస్తీ, చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. అదుబాటులో ఉన్న క్విక్ యాక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను రంగంలోకిదించారు. అలాగే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments