Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ పేరిట మత్తు ఇంజెక్షన్.. బంగారు నగల్ని దోచేసిన నర్సు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:11 IST)
కరోనా వ్యాక్సిన్ పేరిట ఓ నర్సింగ్ స్టూడెంట్ దోపిడీకి పాల్పడింది. ఏదో కెమికల్ కలిపిన మత్తు ఇంజెక్షన్‌ను కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ఓ వృద్ధదంపతులకు వేసింది. వారు మత్తులోకి జారుకున్నాక వారివద్ద వున్న బంగారు నగలను దోచుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాదులోని మీరట్, లలితా నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితులు లక్ష్మణ్ (80), ఆయన భార్య కస్తూరి (70)లను కలిసి కరోనా వ్యాక్సిన్ అని ఇంజెక్షన్ వేసిన నర్సింగ్ స్టూడెంట్ వారి వద్ద నగలను దోచుకుంది. 
 
లక్ష్మణ్ రిటైర్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉద్యోగి. కస్తూరి గృహిణి. వీరివద్దకు 21 ఏళ్ల అనూష అనే నర్సింగ్ యువతి.. కోవిడ్ వ్యాక్సిన్ పేరిట వృద్ధ దంపతులకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం చేసింది. ఈ ఇంజక్షన్ ఎఫెక్టుతో మత్తులోకి జారుకున్న దంపతుల వద్ద బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, చెవిపోగులను దోచుకెళ్లింది. ఈ విషయమై మత్తు నుంచి తేరుకున్నాక మీరట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ విచారణలో అనుష అనే యువతి మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ స్టూడెంట్ అని తేలింది. ఆపై పోలీసులు అనుషను కస్టడీలోకి తీసుకుని ఆమె దోచున్న ఆభరణాలను బాధితులకు అప్పగించేలా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments