Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పనిచేయని టీకా: వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజుల తర్వాత కరోనా!

పనిచేయని టీకా: వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజుల తర్వాత కరోనా!
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (11:18 IST)
కరోనా వైరస్ సోకకుండా అభివృద్ధి చేసిన టీకా పెద్ద ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఈ టీకా తీసుకున్న పలువురు మృత్యువాతపడుతున్నారు. అలాగే, మరికొందరికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతోంది. తాజాగా కరోనా టీకా వేయించుకున్న 20 రోజుల తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు వైరస్ బారిన పడటం కలకలం రేపింది. 
 
నిమ్స్‌కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్‌కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్‌ను తీసుకున్నారు. కాగా, ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 
 
టీకా తీసుకున్న తర్వాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఆ ఇద్దరి వైద్యులు పేర్లు మాత్రం బహిర్గతం చేయడం లేదు. 
 
కాగా, మన దేశంలో వ్యాక్సినేషన్ గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే, రెండు డోస్‌లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, చాలా మంది ఈ వైరస్ సోకదన్న భావనలో ఉన్నారు. ఫలితంగానే టీకా వేయించుకున్న తర్వాత కూడా ఈ వైరస్ సోకుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం