Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం

ఇద్దరు మిత్రుల కోసమే సాగు చట్టాలు : ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (10:54 IST)
తన ఇద్దరు మిత్రుల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పైగా, దేశంలోని వ్యవసాయ వ్యాపారన్నంతా ఆ ఇద్దరు స్నేహితులకు అప్పగించేందుకు ప్రధాని అహర్నిశలు కృషిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
రాజస్థాన్‌ అజ్మీర్‌ జిల్లా రూపన్‌గఢ్‌లో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, 'రైతులకు ఆప్షన్లు ఇస్తున్నానని అంటున్నారు. అవి.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు మాత్రమే' అని ఎద్దేవా చేశారు. 
 
కాగా, వారసత్వ రాజకీయాలపై వస్తున్న విమర్శలపై రాహుల్‌ స్పందించారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తమ కుటుంబసభ్యులు ప్రధాని పదవి నిర్వహించారన్నారు. 'నాకో సైద్ధాంతిక దృక్పథం ఉంది. రాజీవ్‌ గాంధీ కొడుకుగా నన్ను చూడొచ్చు. అంతమాత్రాన సిద్ధాంతాల కోసం నేను సాగిస్తున్న పోరును ఎవరూ నిలువరించలేరు' అని ప్రకటించారు. 
 
ఇటీవల కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు తీవ్ర హాని కలిగించేలా ఉన్నాయని, దేశంలోని కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ దేశంలోని రైతులు గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో కీచకపర్వం : కాలేజీ విద్యార్థిని లాక్కెళ్లి సామూహిక బలాత్కారం