Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం? న్యూస్ చానెల్ ఉద్యోగిని ఆత్మహత్య

Webdunia
బుధవారం, 15 జులై 2020 (08:48 IST)
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఓ న్యూస్ చానెల్‌లో పని చేస్తూ వచ్చిన ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఇదే న్యూస్ చానెల్‌లో పని చేస్తూ వచ్చిన మరో ఉద్యోగితో ప్రేమలో పడింది. అది విఫలం కావడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన హైదరాబాద్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దిపేటకు చెందిన పి.రాములు కుమార్తె కళ్యాణి (26) అనే యువతి ఓ న్యూస్ చానెల్‌‌లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే చానెల్‌లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, వయసు పైబడటంతో పాటు.. తనను వివాహం చేసుకోవాలంటూ శివపై కళ్యాణి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీనికి శివ నిరాకరించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరంకావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. పైగా, ఇక తాను బతకడం వృథా అని భావించిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించింది. 
 
తన సోదరుడితో కలిసి ఆమె ఇక్కడ ఉంటుండగా, అతను విధులు ముగించుకుని వచ్చేసరికి కళ్యాణి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివ కారణమన్న ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments