సింగిల్‌ డేలో సరికొత్త రికార్డును సృష్టించిన హైదరాబాద్ మెట్రో

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:04 IST)
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెల 3వ తేదీన మెట్రో రైలులో ఏకంగా 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లి మార్గంలో అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. అలాగే, ఈ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 
 
కాగా, భాగ్యనగరిలో గత 2017 నవంబరు 29వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నగరంలోని రహదారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉండటంతో భాగ్యనగరి వాసులు అధికంగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆఫీస్ వేళల్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అమీర్‌పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సేవల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments