Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైన్ కట్టమన్న ట్రాఫిక్ పోలీసులు.. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తి

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (09:31 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ ఫసీయుద్దీన్‌(35) వ్యాపారి. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మూడేళ్లలో 28 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడు. మంగళవారం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ ఎస్సై శంకర్‌ ఆధ్వర్యంలో కిషన్‌గూడ పైవంతెన వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అతని వాహనాన్ని ఆపారు. దానికున్న పెండింగ్‌ చలాన్లను పరిశీలించగా రూ.9,110 జరిమానా ఉన్నట్లు తేలింది. 
 
ఈ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించిన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ఫసీయుద్దీన్‌ తన వాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ తెరిచి నిప్పంటించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఫసీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments