Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మందు, గుట్కా అలవాటు.. అంతే భర్తే గొంతుపై కాలితో తొక్కి..?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:01 IST)
భార్య ప్రవర్తనలో మార్పు కారణంగా ఓ భర్త ఆమెను హతమార్చిన ఘటన మారేడ్‌పల్లి బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్‌లోని భద్రయ్య వెంచర్‌లోని ఓ ఇంట్లో ఈనెల-15న అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభించింది. 
 
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ మహిళను భర్తే గొంతుపై కాలితో తొక్కి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మృతురాలి భర్త ఈస్టు మారేడ్‌పల్లి గొల్లకిట్టి బస్తీకి చెందిన హబీబ్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు షేక్‌ భానుబేగం. ఆమెకు మద్యం సేవించడం, గుట్కాలు నమిలే అలవాటుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. 
 
తాను ఇంట్లో లేనిసమయంలో ఇతరులు వస్తున్నట్లు హబీబ్‌ గమనించాడు. అనుమానంతో ఎలాగైనా భార్యను అంతమొందించాలనుకున్నాడు. స్నేహితుడి సాయంతో భార్యతో గొడవపడిన హబీబ్‌ కాళ్లతో ఆమె తలపై తన్నుతూ మెడపై కాలితో తొక్కి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోని ఓ దుప్పటిలో చుట్టి గదిలోనే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments