హైదరాబాద్ చిరుత పట్టుబడింది

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (20:42 IST)
హైద‌రాబాద్‌ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు. చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. 
 
దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  చిరుత పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments