Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విషాదం... ఏఎస్ఐ మృతి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (10:42 IST)
హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మహిపాల్ కన్నుమూశారు. 
 
ఈ నెల 27వ తేదీన శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఆయన్ను కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుది శ్వాస విడిచారు. 
 
నిజాంపేట్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వస్తున్న సృజన్ అనే యువకుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కు మళ్లే సమయంలో వెనుక ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. 
 
మళ్లీ వెంటనే ముందుకు రానివ్వడంతో అక్కడున్న హోంగార్డుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సృజన్‌కు ఆల్కహాల్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి స్టేషన్‌కు సమాచారమిచ్చారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి పెట్రోలింగ్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటుండగా.. అటుగా వస్తున్న మరో కారు ఏఎస్సై మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది మహిపాల్ రెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి రాత్రి కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments