జానపద గాయకుడు జటావత్ మోహన్ బలన్మరణం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (14:52 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు జటావత్ మోహన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన హైదరాబాద్ నగరంలోని చంపాపేటలో ఉంటున్న తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషాదచాయలు అలముకున్నాయి. 
 
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పల్లిగండ్ల తండాకు చెందిన మోహన్ గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి తన గదిలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని బుధవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు మోహన్ మృతదేహాన్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. ఆర్థిక సమస్యల కారణంగానే బలవన్మరణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments