Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన కుమారుడిని ఐటీ అధికారులు చిత్రహింసలు పెట్టారు : మంత్రి మల్లారెడ్డి

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (10:38 IST)
తన కుమారుడిని ఐటీ అధికారులు వేధింపులకు గురిచేసి చిత్ర హింసలకు గురిచేశారని తెరాస నేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఛాతినొప్పి కారణంగా ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఈయన సూరారంలో ఉన్న ఒక ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని చూసేందుకు మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చారు. 
 
అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐటీ అధికారులు తన కుమారుడిని తనిఖీల పేరుతో వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆయన ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలు చిత్రహింసలకు గురిచేసి కొట్టారని తెలిపారు. 
 
తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని కాలేజీలు స్థాపించి సేవ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో యేళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. కష్టపడి సంపాదించి, నిజాయితీగా బతుకుతున్నామని చెప్పారు. 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తమపై ఐటీ సోదాలు చేశారని, 200 మంది ఐటీ అధికారులు తమ గృహాలు, కార్యాలయాలపై సోదాలు చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments