Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిందని నమ్మబలికి అడ్డంగా బుక్కైన భర్త...

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (08:39 IST)
కట్టుకున్న భార్యను కడతేర్చి.. కరోనా వైరస్ సోకి చనిపోయిందని అత్తమామలతోపాటు ఇరుగు పొరుగువారిని నమ్మించాడు. కానీ, అత్తింటివారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ మహిళ మృతి కేసులోని మిస్టరీ వీడిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పిల్లిగుంట తండాకు చెందిన విజయ్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన కవిత (21) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు హయాత్‌నగర్‌ పరిధిలోని ఇంజాపూర్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 18న కవిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 
 
ఈ నెల 10న ఆమెకు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌ వచ్చిందని, 18న వ్యాధి తీవ్రతతో చనిపోయిందంటూ విజయ్‌ అత్తింటివారిని నమ్మించాడు. దీంతో కరోనా ప్రొటోకాల్‌ పేరిట.. మృతదేహాన్ని ఆగమేఘాల మీద పిల్లిగుంట తండాకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. అయితే.. విజయ్‌, తన తల్లిదండ్రులు పరీక్షలు చేయించుకున్నా.. నెగటివ్‌ రావడంతో కవిత తల్లి అనుమానించారు. 
 
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి.. ఈ నెల 10వ తేదీన కవిత కరోనా పరీక్ష రికార్డులను పరిశీలించారు. ఆమెకు నెగటివ్‌ అని తేలడంతో.. విజయ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పిల్లిగుంట తండాలో పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు. భార్యపై అనుమానంతోనే కట్టుకున్నోడు ఈ పని చేయించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments