Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోతున్నా... నా భర్తను వదిలిపెట్టొద్దు : భార్య సూసైడ్ లేఖ

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:43 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తే.. అనునిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆ మహిళ తట్టుకోలేక పోయింది. దీంతో తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారన్న విషయాన్ని కూడా మరచిపోయి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సూసైడ్ చేసుకుంటూ ఓ లేఖ రాసిపెట్టింది. "నేను చనిపోతున్నా... నా భర్తను వదిలిపెట్టొద్దు" అంటూ అందులో పేర్కొంది.
 
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, రహమత్‌నగర్‌ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన విజయ (31) అనే మహిళకు 14 యేళ్ల క్రితం ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన రోజు నుంచి భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేయసాగాడు. 
 
ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయ తన తల్లికి ఫోన్‌ చేశారు. పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయ ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆమె బలవన్మరణానికి పాల్పడేముందు ఓ సూసైడ్ లేఖను రాసిపెట్టింది. అందులో... 'ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతో పాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్పి, అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు. చివరికి నన్ను చంపడానికి చూశాడు. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్ధు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి' అంటూ లేఖలో పేర్కొంది. 
 
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమంటూ విజయ తల్లి మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లిస్తే, 
 ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతో పాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్ఫి. అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు.. చివరికి నన్ను చంపడానికి చూశాడు.. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ.. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు.. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే.. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్ధు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి’’ అంటూ ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments