హేమంత్ పరువు హత్య.. ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి..

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:24 IST)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే సుపారీ ముఠాకు చెందిన ఇద్దరితోపాటు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. హత్య కేసులో క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సైతం పూర్తి చేశారు. కేసు దర్యాప్తు బృందంలో ఒకరైన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ కొవిడ్‌ బారినపడటంతో దర్యాప్తు బాధ్యతలను రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.
 
ఫాస్ట్‌కోర్టు ఏర్పాటు చేసేలోపు దర్యాప్తు పూర్తి చేస్తామని, నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతితోపాటు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులను కోరారు. 
 
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తనతోపాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని అవంతి సీపీని కోరింది. స్పందించిన ఆయన చందానగర్‌లో హేమంత్‌ ఇంటివద్ద భద్రత కల్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments