Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కరోనా మృతదేహాల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీస్

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:54 IST)
ఆ యువకుడి తల్లి కరోనా వైరస్ సోకి కన్నుమూసింది. ఫలితంగా ఆ యువకుడు తల్లి అంత్యక్రియలను నిర్వహించలేక తీవ్ర మనసికక్షోభను అనుభవించాడు. తనలా మరొకరు బాధపడకూడదని భావించి, ఓ నిర్ణయానికి వచ్చాడు. తన స్నేహితులతో కలిసి కరోనా మృతదేహాల తరలింపు, వారి అంత్యక్రియల కోసం ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. గతంలో వలసకూలీల కోసం ఫీడ్ ద నీడ్ పేరుతో ఎంతోమందిని ఆదుకున్న ఈ స్నేహితులు... ఇపుడు సర్వ్ ద నీడ్ పేరుతో కరోనా మృతదేహాల తరలింపు సేవలో తరిస్తున్నారు. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన ఈ సేవకుల వివరాలను పరిశీలిస్తే, కరోనా సోకి చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి అంత్యక్రియలు చేయలేని తమ స్నేహితుడు పడిన మానసిక క్షోభ మరెవరూ పడకూడదని భావించిన కొంతమంది ఐటీ ఉద్యోగులు ముందుకు వచ్చారు. 
 
కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక అంబులెన్స్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేస్తున్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి దేహాలను శ్మశాన వాటికకు తరలించడం, అంత్యక్రియలను నిర్వహించడం వంటివి చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. 
 
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సాయితేజ, అమన్‌జీత్‌ సింగ్‌, తమ స్నేహితులతో కలిసి ముందుకు వచ్చారు. లాక్డౌన్‌ సమయంలో ‘ఫీడ్‌ ద నీడ్‌’ పేరుతో వలస కార్మికులకు, పేదవారికి ఆహారం అందించిన వీరు లాక్‌డౌన్‌ అనంతరం ‘సర్వ్‌ ద నీడ్‌’ పేరుతో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
 
అనేక మంది కుటుంబ సభ్యులు కరోనా సోకడం వల్లనో.. కరోనా లక్షణాలు ఉండటం వల్లనో క్వారంటైన్‌లో ఉండటం వల్ల కరోనా మృతులకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నామని వారు పెద్దమనసుతో చెపుతున్నారు. ఈ అంబులెన్స్ నడిపేందుకు ఇద్దరు సిబ్బందిని నియమించి, వారికి జీతభత్యాలు వారే చెల్లిస్తున్నారు. 
 
లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో వీటిని ప్రారంభించారు. ఈ సర్వీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సేవలను ఉపయోగించు కోవాలనుకునేవారు 84998 43545 అనే వాట్సాప్ నంబరును సంప్రదించాలని కోరారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారని, త్వరలో వీరి కోసం కూడా అంబులెన్స్‌ను ప్రారంభించనున్నట్లు సాయితేజ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments