Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (17:01 IST)
హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ యజమాని వేధింపులు తట్టుకోలేక ఓ తల్లి  ప్రాణం తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఓ అమ్మాయి పనికి కుదిరింది. ఆమెపై కన్నేశాడు ఆ మాల్ యజమాని వివేకానంద(40). ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. 
 
లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆయినా ఆమె లొంగలేదు.. ఫలితం లేదనుకొని ఏకంగా ఆమె తల్లి కన్యాకుమారితో మాట్లాడి తనకు సహకరించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాదు కోరిక తీర్చకపోతే మీ అంతు చూస్తామంటూ తల్లి కన్యాకుమారిని బెదిరించాడు. కొద్దిరోజులుగా ఈ వేధింపులు తీవ్రం కావడంతో తల్లీకూతుళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 
 
సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు ఆ తల్లీకూతుళ్లు. తను చనిపోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన తల్లి కన్యాకుమారి ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డ షాపింగ్ మాల్ యజమానిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం