Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారీ బ్యాగ్‌పై లోగో ఉంటే ఉచితంగా ఇవ్వాల్సిందే... లేదంటే ఫైన్

Webdunia
ఆదివారం, 26 మే 2019 (13:21 IST)
పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. దీంతో అనేక షాపులు, మాల్స్ తమ కంపెనీల పేరుతో లోగోలను ముద్రిస్తున్నాయి. ఇలాంటి బ్యాగులకు కూడా రూ.2 లేదా రూ.5 చొప్పున వసూలు చేస్తున్నాయి. 
 
అయితే, ఆయా కంపెనీలు తమ లోగోలను ముద్రించివుంటే అలాంటి క్యారీబ్యాగులను ఉచితంగా ఇవ్వాల్సిందేనంటూ గతంలో చంఢీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇపుడు ఈ తీర్పును ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం తీర్పునిచ్చింది. 
 
అంతేకాకుండా, లోగోవున్న క్యారీబ్యాగుకు రూ.5 ధర వసూలు చేసిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్‌ మాల్‌కు ఏడు వేల రూపాయల అపరాధం విధించింది. ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గత నెల 18వ తేదీన ఈ షాపింగ్ మాల్‌లో వస్తువులు కొనుగోలు చేయగా, ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన బ్యాగుకు రూ.5 వసూలు చేశారు. 
 
నిజానికి డబ్బులు వసూలు చేస్తున్నందున లోగో లేని క్యారీ బ్యాగు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ లోగో ఉన్న క్యారీబ్యాగు ఇవ్వడంపై సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కారం కేంద్రం పై విధంగా తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments