Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారీ బ్యాగ్‌పై లోగో ఉంటే ఉచితంగా ఇవ్వాల్సిందే... లేదంటే ఫైన్

Webdunia
ఆదివారం, 26 మే 2019 (13:21 IST)
పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. దీంతో అనేక షాపులు, మాల్స్ తమ కంపెనీల పేరుతో లోగోలను ముద్రిస్తున్నాయి. ఇలాంటి బ్యాగులకు కూడా రూ.2 లేదా రూ.5 చొప్పున వసూలు చేస్తున్నాయి. 
 
అయితే, ఆయా కంపెనీలు తమ లోగోలను ముద్రించివుంటే అలాంటి క్యారీబ్యాగులను ఉచితంగా ఇవ్వాల్సిందేనంటూ గతంలో చంఢీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇపుడు ఈ తీర్పును ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం తీర్పునిచ్చింది. 
 
అంతేకాకుండా, లోగోవున్న క్యారీబ్యాగుకు రూ.5 ధర వసూలు చేసిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్‌ మాల్‌కు ఏడు వేల రూపాయల అపరాధం విధించింది. ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గత నెల 18వ తేదీన ఈ షాపింగ్ మాల్‌లో వస్తువులు కొనుగోలు చేయగా, ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన బ్యాగుకు రూ.5 వసూలు చేశారు. 
 
నిజానికి డబ్బులు వసూలు చేస్తున్నందున లోగో లేని క్యారీ బ్యాగు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ లోగో ఉన్న క్యారీబ్యాగు ఇవ్వడంపై సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కారం కేంద్రం పై విధంగా తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments