Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి రేప్ చేసిన వంట మనిషి!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (09:14 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వంటమనిషి పాడుపనికి పాల్పడ్డాడు. బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపి 19 యేళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, లాలాపేటలో నివాసముంటున్న 19 యేళ్ళ యువతి.. బర్కత్‌పురలోని ఓ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పీర్జాదిగూడకు చెందిన రవి (40) అనే వ్యక్తి వండ మనిషిగా పని చేస్తున్నాడు. 
 
అయితే, ఆ యువతిపై కన్నేసిన రవి.. ఆమెకు బత్తాయి జ్యూస్‌లో మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు. అది సేవించిన ఆ యువతి అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేశారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చడంతో శరీరంలో మార్పులు సంభవించాయి. 
 
దీంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. గురువారం ఆ యువతి కాచిగూడ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. రవిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments