Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో 15 గంటల్లో.. 35 మంది మృతి

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:33 IST)
కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి.. అంటే కేవలం 15 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మరెందరో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. 
 
కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. 
 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి కారణాలేవైనాగానీ.. గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణమృదంగం వినిపిస్తోంది. 
 
కాగా.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ (15గంటల్లో) చనిపోయిన 35 మందిలో 45, ఆలోపు వయసువారు తొమ్మిది మంది ఉండడం గమనార్హం. మిగతావారంతా 46 నుంచి 83 ఏళ్ల వారు. ఈ 35 మందిలో 16 మంది మహిళలు కాగా, 19 మంది  పురుషులు. కాగా, ప్రస్తుతం గాంధీలో 308 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments