హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం బంద్.. డబ్బులు పంచుతున్నారా?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (23:05 IST)
ఎంతో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. 
 
బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజేందర్ , టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు ప్రచారంలో దూసుకుపోయారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకోగా.. టీఆర్ఎస్ తరపున అన్నీ తానై ప్రచారం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావుపైనే టీఆర్ఎస్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
 
మరోవైపు ప్రచారానికి గడువు ముగిసిన తరుణంలో ప్రలోభాలకు తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలే డబ్బులు పంచుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. 
 
అలాగే అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ భారీగా డబ్బు పంచుతోందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఆ పార్టీ ఎంత డబ్బు ఇచ్చిన తీసుకుని తమకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments