Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వదిన - మరిది మధ్య వివాహేతర సంబంధం : చివరకు...

వదిన - మరిది మధ్య వివాహేతర సంబంధం : చివరకు...
, బుధవారం, 27 అక్టోబరు 2021 (10:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా దేవరకద్రలో వదిన, మరిది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిద్దిర మధ్య ఉన్న వివాహేతర బంధమే వారి ప్రాణాలను తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన (23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌గ‌న‌న్న పాల వెల్లువ‌... బల్కు మిల్కు కూలింగ్ యూనిట్లు ఏర్పాటు