Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర మంత్రిపై తేనెటీగల దాడి

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (08:41 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగల దాడి జరిగింది. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. 
 
అయితే, మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువు నిర్వహించారు. ఈ క్రతువులో పాల్గొన్న మంత్రి పువ్వాడ తదితరులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆలయ వేదపండితులు, మంత్రి సెక్యూరిటీ సిబ్బందిని కూడా వదిలిపెట్టలేదు. 
 
అయితే, మంత్రిని తేనెటీగలు కుట్టినప్పటికీ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
తనపై అనుకోని రీతిలో తేనెటీగల దాడి జరిగిందనీ, రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూసించారని తెలిపారు. పైగా, తాను క్షేమంగానే ఉన్నట్టు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments