Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌_రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:35 IST)
డ్రగ్స్ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరన వైట్ చాలెంజ్ తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజేసింది. రేవంత్ ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు విసిరారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణ నెలకొంది. 
 
రేవంత్ ఇంటిని ముట్టించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా.. కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధంయ ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.  
 
మరోవైపు రేవంత్, కేటీఆర్‌ మధ్య మొదలైన డ్రగ్స్ రగడ కొనసాగుతోంది. కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాలు విసిరిన రేవంత్‌రెడ్డి… తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ గన్‌పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో అమరుల స్ధూపాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేశారు. 
 
రేవంత్ ధర్నాతో గన్ పార్క్ అపవిత్రమైందని నిరసన వ్యక్తం చేశారు. అమరవీరుల స్ధూపాన్ని పాలతో కడిగారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments