108 అంబులెన్స్ సర్వీసుల నుంచి జీవీకే సంస్థ తొలగింపు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:32 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్ సర్వీసుల నుంచి ప్రముఖ సంస్థ జీవీకేని తొలగించాలని నిర్ణయించింది. వీటిలో స్థానంలో కొత్త సంస్థల కోసం టెండర్లే పిలవాలన్న ఆలోచనలో వుంది. బహిరంగ టెండర్లు పిలిచేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అధికారులు విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. వాహనాల నిర్వహణలో జీవీకే సంస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగులు, పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
కాగా, తెలంగాణలో 108 అంబులెన్స్‌లను నిర్వహించేందుకు జీవీకే గతంలో చేసుకున్న ఒప్పందం నాలుగేళ్ల క్రితమే ముగిసింది. అయితే ప్రభుత్వం కొత్త టెండర్లు పిలవకుండా ఆ సంస్థకే రెన్యువల్ చేస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో జీవీకే సంస్థ వాహనాలు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో పాటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. అలాగే, అంబులెన్స్‌ల నిర్వహణ లోపంతో చాలాచోట్ల వాహనాలు సడెన్‌గా ఆగిపోతున్నాయి. 
 
దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 108 సర్వీసుల నిర్వహణకు ఇకపై కొత్త సంస్థలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే, జీవీకే సంస్థ కూడా ఈ నెలాఖరు వరకే అంబులెన్స్ సర్వీసులు నడుపనుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments