Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ‌ ఆఫర్ : గవర్నర్ కోటా అంటే ఆషామాషీనా?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (18:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఆ తర్వాత ఈయన పేరును హుజురాబాద్ తెరాస అభ్యర్థిగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, సీఎం కేసీఆర్ మరోలా ఆలోచించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. ఇపుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. ఈ మేరకు ఫైల్‌ను గవర్నర్ తమిళిసైకి పంపించారు.
 
అయితే ఇంతవరకు రాజ్ భవన్ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. ఇది తెరాసలో శిబిరంలో టెన్షన్ పుట్టిస్తోంది. ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పెండింగ్‌లో పెట్టేశారు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై బుధవారం స్పందించారు.
 
రాజ్‌భవన్‌లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... కౌశిక్‌ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments