Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ‌ ఆఫర్ : గవర్నర్ కోటా అంటే ఆషామాషీనా?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (18:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఆ తర్వాత ఈయన పేరును హుజురాబాద్ తెరాస అభ్యర్థిగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, సీఎం కేసీఆర్ మరోలా ఆలోచించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. ఇపుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. ఈ మేరకు ఫైల్‌ను గవర్నర్ తమిళిసైకి పంపించారు.
 
అయితే ఇంతవరకు రాజ్ భవన్ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. ఇది తెరాసలో శిబిరంలో టెన్షన్ పుట్టిస్తోంది. ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పెండింగ్‌లో పెట్టేశారు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై బుధవారం స్పందించారు.
 
రాజ్‌భవన్‌లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... కౌశిక్‌ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments