Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ వద్ద ఆర్టీసీ విలీన బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:16 IST)
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ప్రస్తుతం గవర్నర్ టైబుల్‌పై ఉంది. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేస్తారా? లేదా? అన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియను అడ్డుపడాలనే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టంచేశారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలన్నదే తమ అభిమతమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్‌భవన్‌కు రాలేదన్నారు. 
 
ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు. అయితే, తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలాన్నారు. ఉద్యోగులు ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తి స్థాయిలో పరిష్కరించేదిగా ఉందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments